
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లోని తిరుమలాపూర్ అంగన్వాడీ కేంద్రంలో రమణమ్మ త్రివేణి అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన గ్రోత్ మేళ పోషణ్ మాస ఉత్సవాలకు ముఖ్య అతిథిగా డిస్టిక్ ఇంజనీరింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు హాజరై కార్యక్రమం యొక్క ఉద్దేశం జయప్రద సూపర్వైజర్ మెడికల్ ఆఫీసర్ రాకేష్ అందరికీ తెలియపరిచినారు, పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు ప్రతి నెల బరువు ఎత్తులు ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ లోపు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి తీయించుకోవాలి అని అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా కండరాల అభివృద్ధి లోప పోషణ ఏదైనా జబ్బులు ఉన్న చిన్న వయసులో గుర్తించి సరియైన ఆరోగ్య పరీక్షలు చేయించుతు వయసుల వారీగా కొలతల ప్రకారం సమతుల ఆహారం పిల్లలకు తినిపించినప్పుడు ఆరోగ్యవంతంగా ఎదిగి నేటి బాలలే రేపటి పౌరులుగా అన్ని రంగాలలో రాణించగలుగుతారని వివరించడం జరిగింది. స్కూలు హెచ్ఎం నాగరాజు మాట్లాడుతూ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం వల్ల డబ్బుతో పాటు పిల్లలు ఆరోగ్య పరిస్థితి కుంటుపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ సుగుణ కుమారి హెచ్ ఇ ఓ సంజీవరెడ్డి ఏఎన్ఎం ఆశ అంగన్వాడీ టీచర్స్ రమణమ్మ త్రివేణి కవిత ఆయాలు ఓదెమ్మ వనమాల హాజరైనారు,