
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సోమవారం టియుడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్, ప్రధానకార్యదర్శి సామంతుల శ్యామ్, రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులు సామల శ్రీనివాస్ లు ఈ సందర్భంగా జనంసాక్షి, ప్రజాతంత్ర స్టాఫ్ రిపోర్టర్లు తడుక సుధాకర్, సారేశ్వర్ లకు సభ్యత్వాన్ని అందజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్, శ్యామ్, శ్రీనివాస్ లు మాట్లాడుతూ టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు మిత్రులు సభ్యత్వం రెన్యూవల్ చేసుకోవాలని, మిగతా జర్నలిస్టులు కూడా సభ్యత్వాన్ని తీసుకుని సహకరించాలని కోరారు. తొందరలోనే అన్ని మండలాల్లో కూడా పర్యటిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని వారు కోరారు.