ప్రేమోన్మాది బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి చేయూత.

# దీపిక,మదన్ లాల్ లకు ప్రభుత్వం అండ..
# ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
# రూ.8 లక్షల చెక్కు అందజేత.

నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట డివిజన్ లోని చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాకు చెందిన బానోతు శ్రీనివాస్ అతని భార్య ప్రేమోన్మాది చేతిలో గత కొన్ని నెలల క్రితం దారుణ హత్యకు గురికాగా వారి పిల్లలు ప్రాణాపాయం నుండి గాయాలపాలై ప్రాణాపాయం నుడి బయటపడ్డ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిన విషయం విదితమే.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బాధిత పిల్లలు బానోతు దీపిక,మదన్ లాల్ లకు పరామర్శించి భరోసా కల్పించారు.కాగా శనివారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బాధిత బానోతు దీపిక,మదన్ లాల్ లకు 8 లక్షల రూపాయల విలువ గల చెక్కు ను అందజేశారు.వారికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే దొంతి తెలిపారు.భవిష్యత్తులో వారి చదువులకు సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!