నందగోకుల్ లో గ్రామ సభ

నిజాంపేట: నేటి ధాత్రి

గ్రామస్తులు వర్షాకాలం నేపథం లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు గ్రామసభలో లేవనెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రేణుక, పాఠశాల ప్రధానోపాధ్యాయులు,అంగన్వాడి టీచర్,ఆశవర్కర్,గ్రామ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *