
గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్
మొగుళ్లపల్లి నేటి ధాత్రిన్యూస్
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా. స్వచ్ఛ గ్రామలే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీ సేవ తడి చెత్త -పొడి చెత్త నిర్వహణపై గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ మొగుళ్లపల్లి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జిపి సెక్రెటరీ నరేష్ మాట్లాడుతూ. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో. నాయకులు, విద్యార్థులు, అధికారులు, గ్రామస్తులు అందరూ భాగస్వాములు కావాలని మన ఇంటి పరిసరాలను, వీదులను మనమే శుభ్రంగా ఉంచుకుందామని ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో ఏలేటి మధుకర్ రెడ్డి,ఎలకంటి రమేష్,దొమ్మటి కుమార్,తిప్పారపు బుచ్చారావు, సూర్నేని మణికర్ మదవి,మహిళా సంఘం సభ్యురాళ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.