తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాలలో పాఠ్యంశంగా చేర్చాలి – మర్రి వెంకటస్వామి

రామడుగు, నేటిధాత్రి:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో రైతాంగ సాయుధ పోరాట అమరులు గుండి దామోదర్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి. ఈసందర్బంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని, నాలుగు వేల ఐదు వందల మంది అమరుల ప్రాణత్యాగంతో నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు స్వాతంత్రం సిద్ధించిందని,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరులను స్మరించుకుంటూ వారి యొక్క పోరాట స్ఫూర్తితో యువ కమ్యూనిస్టులు పాలక ప్రభుత్వాల విధానాలపైన పోరాటాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో పాటు, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాలలో పాఠ్యంశంగా చేర్చాలని పాలకులను ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, గుండి మాజీ ఎంపీటీసీ గుండి ప్రవీణ్, మడ్డి శ్యామ్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, మ్యాకల నాగరాజు, మచ్చ పవన్ కళ్యాణ్ నాయకులు ఎగుర్ల మల్లేశం,కనుకయ్య,
హరీష్. నాంపల్లి, రాజయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *