తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్ల అధ్యక్షులు శేఖర్ నాని
మూడు నెలల్లో బీసీ కుల గణన పూర్తీ చేయాలి
భూపాలపల్లి నేటిధాత్రి
పూర్తి చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం పట్ల తెలంగాణ బీసి సంక్షేమ సంఘం జయశంకర్ జిల్ల అధ్యక్షులు శేఖర్ నాని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బీసీ కుల గణనపై ఎన్నో పోరాటాలు చేశామని వారు అన్నారు.ఎట్టకేలకు దీన్నిపై విచారించి 3నెలల్లో కుల గణన పూర్తి చేయాలని ఆదేశించడం తమ విజయమని పేర్కొన్నారు.ఈ తీర్పును తక్షణమే అమలు చేయాలని సమగ్ర కుల గణన లెక్కలను నోటిఫై చేసి దాని ప్రాతిపదికగా తీసుకొని అధికారికంగా ప్రకటించాలని తెలిపారు. దానికి అనుగుణంగా 42 శాతం రిజర్వేషన్లతో స్థాని క సంస్థల ఎన్ని కలకు వెళ్లాలని ఆయన సూచించారు. లేకుంటే బీసీలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేపడతారని హెచ్చరించారు