చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బండి శ్రీనివాస్ ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి పదవ తరగతి 2002 బ్యాచ్ కి చెందిన మిత్రులంతా కలిసి జమ చేసిన రూ.30000లను మరియు 50 కేజీ బియ్యంను ఆర్థికసాయంగా అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద బాధిత కుటుంబానికి అండగా ఉంటామని బాల్యమిత్రులు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బాల్య మిత్రులు కట్కూరి నరేందర్.మేడిపెల్లి శ్రీనివాసు.పుల్ల సతీష్. బుర్ర రఘు.ముసపూరి కుమారు.. ఎండి హైదర్ పాషా. మాడిశెట్టి తిరుపతి. పాషిగంటి రాజేందర్.ముసపూరి రవీందర్. ఆకుల రాజు. ముసపూరి రమేష్ పాల్గొన్నారు