సమతుల ఆహారంతో మెదడు చురుకుగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

సూపర్వైజర్ జయప్రద
చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల అంగన్వాడీ కేంద్రం మరియు వివేకానంద ప్రైవేట్ స్కూల్లో బుధవారం రోజున పోషణ మాస ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగడానికి తీసుకోవలసిన సమతుల ఆహారం వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత చదువు యొక్క ప్రాముఖ్యత బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాల గూర్చి వివరించారు సమ తుల ఆహారం భుజించకపోతే పిల్లలలో మెదడు చురుకుగా పనిచేయకపోవడం వ్యాధి నిరోధక శక్తి తగ్గడం నాడీ వ్యవస్థ పని చేయకపోవడం అధిక బరువు పెరగడం ఊబకాయం కండరాలుఎముకలు దృఢంగా లేకపోవడం తొందరగా అలసిపోవడం దేనిపైన శ్రద్ధ లేకపోవడం తొందరగా కోపానికిగురిఅవ్వడం మానసిక ప్రశాంతతను కోల్పోయి అన్ని రంగాలలో వెనకడుగు వేయడం ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని అందుకని 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల బాలబాలికలు తప్పనిసరి ప్రతిరోజు తినే భోజనంలో చిరుధాన్యాలు ఆకుకూరలు పప్పు ధాన్యాలు పాలు పండ్లతో భోజనం చేసినట్లయితే పోషకాహార లోపాన్ని రక్తహీనతను తగ్గించవచ్చని ముందు ముందు అనుకున్న లక్ష్యం చేరుకుంటారని వివరించనైనది ఆరోగ్య శాఖ నుండి హెచ్ ఇ ఓ సంజీవ రెడ్డి మాట్లాడుతూ పిల్లలందరూ వ్యక్తిగత శుభ్రత ఆరోగ్య పరీక్షలు డివామింగ్ టాబ్లెట్లు విటమిన్ ఏ ద్రావము కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా తీసుకోవాలని వివరించారు స్కూల్ హెచ్ఎం మహేందర్ గ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని ప్రైవేటుకు దీటుగా విద్య బోధన చేస్తున్నామని ఐదు సంవత్సరాలలో పుపిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు ఆరు సంవత్సరాల నుండి ప్రైమరీ స్కూల్ కుపంపించాలని వివరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో వివేకానంద ప్రిన్సిపాల్ సతీష్ హెచ్ఎం మహేందర్ గారు సంజీవరెడ్డి , అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ ఉమాదేవి మంగ ఆయా భద్రమ్మ తల్లులు పిల్లలు హాజరైనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!