చాకలి ఐలమ్మకు ఎమ్మెల్యే గండ్ర నివాళి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు యోధురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయ కరమని ఎమ్మెల్యే గండ్ర కొనియాడారు.ఆరోజు ల్లోనే దొరల పెత్తనాన్ని ధిక్కరించిన బహుజన ధీర వనితగా ఐలమ్మ అనేక ప్రజా పోరాటాలకు స్ఫూర్తి నిచ్చా రని గుర్తుచేశారు.చాకలి ఐలమ్మ ఆదర్శలను ప్రజా ప్రభుత్వం పాటిస్తుందని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!