పట్టించుకోని అధికారులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గణపురం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఇటీవల కురిసిన వర్షాలకు బురద మయంగా మారి తాసిల్దార్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే రైతులకు తాసిల్దార్ కార్యాలయం లో పనిచేస్తున్న సిబ్బంది ఈ బురద వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని తాత్కాలికంగా మరమ్మత్తులు చేయగలరని ప్రజలు కోరుకుంటున్నారు