తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల o నుండి వెళ్లే విద్యార్థులకు చాలా ఇబ్బందులు గురవుతున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మెమొంటో రాజన్న సిరిసిల్ల జిల్లాఅధ్యక్షులు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం నుండి చాలామంది విద్యార్థులు సిరిసిల్లకు చదువుకోవడానికి వెళ్తున్నారని ఉదయం 8 9 గంటల నుండి బయలుదేరుతున్నారని వారికి తంగళ్ళపల్లి బస్టాండ్లో బస్సుల గురించి ఎదురుచూడడం జరుగుతుందని ఒకవేళ వచ్చిన బస్సులు ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేస్తూ ప్రయాణికులు కనిపిస్తున్నారని అలాగే అధిక మంది ప్రయాణికులుఉండటం మూలంగా చాలా సందర్భాల్లో బస్సులు ఆపడం లేదని దయచేసి వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా డిఎం గారికి విన్నవించడం .ఏమిటంటే జిల్లెల్లనుండి. సిరిసిల్ల వరకు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఉదయం విద్యార్థులు స్కూలు సమయంలో అధిక బస్సులు కేటాయించాలని విన్నవించడం జరుగుతుంది దయచేసి విద్యార్థులు చదువుకునే విధంగా ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకోవాలని కోరడమైనది చాలామంది విద్యార్థులు సరైన టైముకు రాక పోగా వారు సరైన టైంలో పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని దీనిపై అధికారులు స్పందించాలని కోరుచున్నాము