వేములవాడ నేటిధాత్రి
రాజరాజేశ్వర జలాశయం (మద్యమానేరు )నిర్వాసితుల సమస్యలపై నాడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఎంపీ హోదాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచి పోరాడారు నిర్వాసితులకు ఉపాధి కల్పించడం ఇంటి నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ రూ,5 04 లక్షలు చెల్లించాలని ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకలు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సైతం రూ5.04 లక్షలు ఇప్పిస్తామని నిర్వహిస్తులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం నిర్వాసితుల పక్షాన పోరాడిన నాయకులు మంత్రి ఎమ్మెల్యేలుగా ఉండటంతో తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు మధ్యమనేరు జలాశయం నిర్మాణం లో సర్వం కోల్పోయిన నిర్వాసితుల ఆశలు ఆడియశాలు గానే మిగిలాయని కన్నీరు మున్నీరు అవుతున్నారు
నిర్వాసితుల
పరిహారం చెల్లింపు విషయంలో పలు హామీలు ఇచ్చిన పరిష్కారం లేకపోగా ఏళ్లుగా ఆందోళనలో కొనసాగించారు అప్పుడు మద్దతుగా నిలిచిన నాయకులే అధికారంలోకి రావడంతో సమస్యలు తీరుతాయని భావించిన నిర్వాసితుల ఆశలు ఇప్పటికీ ఆడి యాశలు గానే మిగిలాయి కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా మాన్వాడ వద్ద 27.5 టీఎంసీల సామర్థ్యం తో మద్య మానేరు ప్రాజెక్టు నిర్మించారు దీనివల్ల బోయిన్పల్లి వేములవాడ తంగళ్ళపల్లి తోపాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి సుమారు పదివేల683 కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి నిర్వాసితులకు ఇంటి నిర్మాణంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది అది నెరవేరలేదు దీంతో బాధితులు పలు విధాల ఆందోళనలు చేపట్టారు అప్పుడు వీరికి కాంగ్రెస్ నాయకులు తోడుగా పాల్గొన్నారు అని నిర్వాసితులు చెప్తున్నారు. జలాశయ నిర్మాణం లో సర్వం కోల్పోయిన నిర్వాసితులు ఆర్ అండ్ బి కాలనీకి తరలి వెళ్లారు అయితే సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని గత పాలకులు హామీ ఇచ్చిన కార్యరూపం దాల్చలేదు అర్హులైన ప్రతి కుటుంబానికి రాయితీపై పాడి గేదలు అందిస్తామని చెప్పిన నేటికీ ఇవ్వలేదు ఇప్పటికైనా ముంపు నిర్వాసితులపై వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టి సారించాలని బాధితులు వేడుకుంటున్నారు