దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

భూపాలపల్లి నేటిధాత్రి

(మంగళవారం)భూపాలపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎండోమెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు, అసిస్టెంట్ కమిషనర్ సునీత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ రావు, ఏఈ దుర్గాప్రసాద్, భూపాలపల్లి డివిజన్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీక్షా లో అధికారులతో నియోజకవర్గంలోని పలు దేవాలయాలపైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చర్చ జరిపారు. ముఖ్యంగా రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ అభివృద్ది, చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలోని నాపాక ఆలయ అభివృద్ధితో పాటు పలు దేవాలయాల అభివృద్ధికి సంబంధించి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నదని, అందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!