భద్రాచలం నేటి రాత్రి
CPIML ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండా చరణ్
చర్ల మండలంలోని పలు వలస ఆదివాసీల గ్రామాలను సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ నాయకత్వం పర్యటించి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా లెనిన్ కాలనీ గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మమేకమై జీవిస్తున్న మూల ఆదివాసీలను గత BRS ప్రభుత్వం అసలు గిరిజనులే కాదని వారినీ అవమానించింది ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ఇక్కడ భూమిపై వీరికి హక్కు లేదని పోడు పట్టాలు ఇవ్వమని, వారికి ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దు చేయాలని భవిష్యత్తులో ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పింది దాని కారణంగా ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సర్టిఫికెట్లు లేక విద్యార్థులు చదువులకు దూరమయ్యారు ఎన్నికల్లో మూల ఆదివాసులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు
చర్ల మండలం లో ఉన్న 24 వలసాదిస్తూ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించాలని అన్నారు ఏజెన్సీ గ్రామాల పోడు సాగుభూములు అన్నింటికీ పట్టాలిచ్చి సాగునీటి సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా వలసదివాసి గ్రామాలకు రక్షిత మంచినీరు విద్యుత్తు రహదారి సౌకర్యం విద్యా వైద్య సదుపాయం రేషన్ కార్డులు కుల సర్టిఫికెట్ ఇవ్వాలని అందుకు అవసరమైన నిధులు కేటాయించి కృషి చేయాలని అన్నారు వలస ఆదివాసీల పోడు భూములకు సర్వే చేసి పట్టాలి ఇవ్వాలని వారి గ్రామాలకు ఇండ్లకు గ్రామపంచాయతీలో నమోదు చేసి ఇంటి నెంబర్లు ఇవ్వాలని అన్నారు వలసదివాసి ఎడల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష సూపరాదని వారి యెడల అటవీ అధికారుల దాడులు దౌర్జన్యాలు పోలీసు నిర్బంధాలు ఆపాలని వలసది వాసులకు ఇతర ఆదివాసి గిరిజనులకు అందినట్లే ప్రభుత్వ సబ్సిడీలు సౌకర్యాలు ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనియెడల భవిష్యత్తులో ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ సమస్య పరిష్కారం కోసం జూలై ఒకటవ తారీఖున జరిగే ఐటిడిఏ భద్రాచలం ముట్టడి కార్యక్రమాన్ని ప్రతి మూలా ఆదివాసి పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొండ కౌశిక్ చెన్నం మోహన్ గ్రామస్తులు కన్నయ్య రమేష్ లక్ష్మయ్య రాజు భద్రయ్య నాగేష్ తదితరులు పాల్గొన్నారు