రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని బిజోన్ ఎస్ఆర్కే పాఠశాల సమీపంలో తెలంగాణ సా యుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘ గౌరవాధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి, పుర ప్రముఖులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం రజాకార్ల పై పోరాడి తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఐలమ్మను స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. చాకలి ఐలమ్మ పోరాటపటిమను యావత్తు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవలేరని అన్నారు. ప్రభుత్వం రజకుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రజక సంఘ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.