సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులపై ఏసీపి కి ఫిర్యాదు

హుజురాబాద్ :నేటి ధాత్రి
* సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బి.ఆర్.ఎస్. నాయకుల పై
హుజురాబాద్ ఏసిపి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు…

గత 10 రోజులుగా కొందరు BRS పార్టీ నాయకులు గౌరవ మంత్రివర్యులు పోన్నం ప్రభాకర్ గారి పైన మరియు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ గారి గురించి ‘సోషల్ మీడియా ‘వేదిక గా అసత్యపు ప్రచారాలు చేస్తు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు హుజూరాబాద్ ACP శ్రీనివాస్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు వ్రాసి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, సొల్లు బాబు, మేకల తిరుపతి కొలిపాక శంకర్ నేరేళ్ళ మహేందర్ గౌడ్ సందమల్ల బాబు చల్లూరి రాహుల్, మహిళా నాయకురాల్లు వేముల పుష్పలత, లంకదాసరి లావణ్య, ఆలేటి సుశీల, పుల్ల రాధ, యండి కరీమా, లక్ష్మీ, దుబాసి బాబు, కుర్ర శ్రీనివాస్ గౌడ్, నర్సింగ్, సమ్మెట సంపత్, తాళ్ళపెల్లి రమేష్, బండారి సదానందం, మోరె తిరుపతి, గంటా కిరణ్ రెడ్డి, గడ్డం రాఘవేంద్ర, కడారి తిరుమల,తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *