జమ్మికుంట (టౌన్): నేటిధాత్రి
*నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు)*
సమైఖ్య ఆంధ్రుల పాలనలో తెలంగాణకు అన్యాయం చేశారని,
నీళ్లు , నిధులు నియామకాలు పై సుదీర్ఘ పోరాటం చేసి స్వరాష్ట్ర తెలంగాణ సాధన కోసం ఆంధ్ర పాలకులతో పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకొని అసువులు బాసిన తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు అండగా నిలిచి వారికి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ సాధనలో సుమారు 1200 మంది బలిదానాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన వారి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు.
జూన్ రెండున జరిగే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అధికారిక లోగోను మార్చడమే కాకుండా తెలంగాణ కోసం ప్రాణాలర్పించి అసువులు బాసిన కుటుంబాలకు అండగా నిలిచి ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా,
ఒక పక్క ఇల్లు ,
అమరులైన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలో వీర పోరాటం చేసి పోలీస్ కేసులు అయి నేటికీ కోర్టులో చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకుంటూ నెలకు 20వేల పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.