
జమ్మికుంట (టౌన్) నేటి ధాత్రి
* ప్రభుత్వ రాజముద్రలో చార్మినార్ మరియు ఓరుగల్లు చిన్హన్ని మార్పు చేయటం సిగ్గుమాలిన పని అని అన్నారు **
*వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ కు బదులు టీజీగా మార్పు చేయడం తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు*
రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు* *జమ్మికుంట పట్టణంలోని జెడ్పిటిసి కార్యాలయంలో పత్రిక సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేక కొనసాగుతుందని, ఈ సందర్భంగా జమ్మికుంట జడ్పిటిసి,డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ పాలన ప్రజలకు ఎంతగానో మేలు చేసిందని భావించిన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పాలన మొండి చేయి చూసిందని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలల గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూపొందించిన. ఏఒక్క అంశం కార్యచరణ దాల్చలేదని వారు గుర్తు చేశారు. కేవలం మహిళలకు ఉచిత బాసు ప్రయాణం తప్ప, మరి ఏదీ కూడా కార్యచరణ దాల్చలేదని వారు గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రోడ్డు రవాణాకు వాహనాలల సంబంధించిన టీఎస్ నుండి టీజీ మార్చడం తప్ప వారు చేసింది ఏది లేదని దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని వారి సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం తెలంగాణ అధికారం ముద్ర ఏర్పాటు చేసిన పది సంవత్సరాలు అయినప్పటికీ ఎవరు కూడా దానిపైన అభ్యంతరం చేయలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రాజముద్రలో మార్పులు చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని వారు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాలయాపన చేయడానికి ఇవి ఒక కారణాలుగా చూయించి సమయాన్ని వృధా చేయడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని వారు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికల కోడ్ అనంతరం ప్రజా సమస్యల పైన నిరంతరం పాలన చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం వానకాల సీజన్ రాబోతున్న సందర్భంలో విత్తనాలు,ఎరువుల కొరత రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన కూడా తెలంగాణ ద్రోహులు చెప్పిన విధంగానే పనిచేస్తుందని వారి సందర్భంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చి తుగ్లపాలన తలపిస్తుందని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని వారు గుర్తు చేశారు.