మందుబాబుల నిరక్ష్యం తో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

బ్లోయర్ తో మంటలు ఆర్పి వేసిన అటవీ అభివృద్ధి సంస్థ సిబ్బంది

జైపూర్ , నేటి ధాత్రి:

మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో బుధవారం సాయంత్రం మందు బాబుల నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకోని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్లాంటేషన్ లో మంటలు చెలరేగి పొగలు వస్తున్నాయని జైపూర్ కు చెందిన స్థానికులు కొందరు అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ వాచర్ సాయికిరణ్ కు సమాచారం ఇచ్చారు.ఆ తర్వాత పై అధికారుల ఆదేశాల మేరకు వెంటనే మిగిలిన వాచర్ లను పిలిపించి సంఘటనా స్థలానికి వెళ్లి ఫైర్ బ్లోయర్ ల సహాయంతో మంటలను అర్పివేసి ప్లాంటేషన్ ను, అటవీ ప్రాంతాన్ని అగ్ని ప్రమాదం నుంచి రక్షించారు. ఈ సందర్బంగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసిన వాచర్ లు శంకర్ సాయికిరణ్ లను అటవీ అభివృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారిణి సాగరిక లు అభినందిoచారు. వీరు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.అటవీ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మధ్యం సేవించిన మైకంలో సిగరెట్ లు తాగి నిర్లక్ష్యంగా పడేయడం వల్లనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!