పార్కుల నిర్వహణ జిహెచ్ఎంసి చేపట్టాలి:కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య
క్షుడు శేరిసతీష్ రెడ్డి
కూకట్పల్లి మే 25 ధాత్రి ఇన్చార్జి
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో పలు పార్కులను కాంగ్రెస్ నాయకులు పరిశీ లించారు. కూకట్పల్లి నియోజకవర్గం కాం గ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నా యకులు బృందం శనివారం పార్కులు సందర్శించి పరిశీలించారు. పార్కుల మెయింటెనెన్స్, పార్కుల్లో ఉన్న సమస్యలను గుర్తించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా అవసరాల కోసం పేరుతో హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవసరా లు లేనప్పటికీ ఖాళీ స్థలాలను కమిషన్ల కోసం పార్కులను నిర్మించారని అన్నా రు.నిర్మించిన పార్కుల నిర్వహణ జిహె చ్ఎంసి ఆధ్వర్యంలో జరగాలని అయితే ఇక్కడ మా త్రం బి ఆర్ ఎస్ నాయకులు పార్కులో తిష్ట వేసి సొంత జాగరుగా వాడుకుం టున్నారని ఆరోపించారు.అంతేగాక కేపీహెచ్బీ ఎలసి ఫ్లాట్స్ ప్రాంతంలో గల పార్కుల్లో రాత్రి వేళల్లో అసాంఘిక కార్య క్రమాలు జరుగుతున్నా యని వీటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.అభివృద్ధి అంటే ప్రజాధనంతో నిర్మించి పట్టించు కోకుండా ఉండడం కాదని,గత ప్రభుత్వం హయంలో పా
ర్క్లో డెవల ప్మెంట్ కోసం అని కోట్ల రూపాయలు నిధులు వేచించి టెండర్లు పిలిచి కమిషన్ల కోసం పండు చేపట్టి నిర్వహణ బాధ్యత మరిచిపోయారని వెంటనే జిహెచ్ఎంసి అధికారులు పార్కు లను పరిశీలించి ప్రజా అవసరాలకు వినియోగంలోకి తీసుకురావాలని కోరా రు.ఈ విషయమై తాము జిహెచ్ఎంసి అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శేరి సతీష్ రెడ్డి స్పష్టం చేశారు.కార్యక్రమంలో పాల్గొన్నారు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి,114 కెపిహెచ్బి డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రాజు,మహిళా అధ్యక్షురాలు పొన్నం రజితగౌడ్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి,ఫణీంద్ర కుమార్,మేకల మేకలు,నాగమల్లేశ్వరరావు,బాబ్జి,నితీష్ కుమార్ గౌడ్,కిరణ్,సా యితేజగౌడ్,అ రవింద.