విత్తన కొనుగోలుపై రైతులకు అవగాహన

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

వానాకాలం పంటల సాగులో విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని పొత్కపెల్లి AEO V. కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఓదెల మండలం జీలకుంట గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని, లైసెన్స్ ఉన్న డీలర్ వద్ద మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. పంట దిగుబడి వచ్చే వరకు, పంట కాలం పూర్తయ్యే వరకు రసీదు జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నారు. రసీదులో విత్తన కంపెనీ పేరు, రకం, బ్యాచ్ నెంబర్ ,లాట్ నెంబర్, రేటు ఉండాలన్నారు. ప్యాకెట్ మీద తయారీ తేదీ, కాలం ముగిసిన తేదీ చూసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!