రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి.

#రైతులు లైసెన్సు ఉన్న షాప్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.

#మండల వ్యవసాయ అధికారి ఆర్ పరమేశ్వర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి: అనుమతులేని కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి ఆర్ పరమేశ్వర్ అన్నారు శనివారం మండల కేంద్రంలో విత్తనాల వ్యాపారస్తులతో సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పలు విత్తనాల విక్రయ కోసం వచ్చిన సందర్భంలో ప్రతి డీలరు నాణ్యమైన విత్తనాలు రైతులకు విక్రయించాలని మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలు అధిక రేట్లకు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అలాగే తప్పనిసరిగా ప్రతి షాపు నందు విత్తనాల వివరాలను స్టాక్ బోర్డులో నమోదు చేయాలి రైతు కొన్న ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి లేనియెడల సదరు డీలర్ పై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో ఏ ఈ ఓ లు శ్రీకాంత్, సాధన, భాస్కర్, మహేందర్, భారతి, డీలర్లు బిక్షపతి, రవీందర్ గౌడ్, శివరాత్రి శ్రీనివాస్ గుప్తా, గోనె రాంబాబు, ఎస్.కె మైనద్దీన్, పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!