రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే సత్యం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట నుండి గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామాల మధ్య రోడ్డు గుంతల మయంగా మారి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తిర్మలాపూర్ గ్రామం వద్ద రోడ్డును పరిశీలించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం తూతు మంత్రంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయించి నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రజల ఇబ్బందులను తీర్చాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గోపాలరావుపేట నుండి బూరుగుపల్లి వరకు రోడ్డు నిర్మాణం కోసం ఆరు కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఈసందర్భంగా ఎమ్మెల్యే సత్యం అధికారులను ఆదేశించారు. ఏళ్లకు ఏళ్లుగా గుంతలమయంగా ఉన్న రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడ్డ తమ కష్టాలు త్వరలోనే తీరునున్నాయని రెండు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు రెండు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి హరీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి, ముదిరాజ్, దేశరాజుపల్లి తాజా మాజీ సర్పంచ్ కోల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, మాజీ ఎంపిటిసి తడగొండ హన్మంతు, మండల ఉపాధ్యక్షులు కట్ల శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు తడగొండ లక్ష్మణ్. తిరుమలపూర్ మాజీ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!