ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గౌతమ బుద్ధుని 2568వ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య పాల్గొని మాట్లాడుతూ గౌతమా బుద్ధుడు బోధిసత్వుడిగా జన్మించి సమాజానికి ధర్మమార్గాన్ని చూపి గొప్ప గురువు అయ్యారని, దేశంలోని ప్రజలు మహిళలు సమానత్వం తో కలిసి ఉండాలని గౌరవం తో జీవించుటకు వారిని చైతన్య వంతులను చేయాలని ఎంతో క్రృషి చేశారని,జీవకోటికి ప్రేమ తత్వాన్ని బోధనలు చేసి, సంపాదన, జీవితం శాశ్వతం కాదు మంచితనం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుందన్నారు. బాల్యం లోనే బాణం దెబ్బ కు విలవిల లాడిన పావురం ను కాపాడినాడని తెలిపారు, రెండు రాజ్యాల మధ్య నదీజలాల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాడన్నారు. తాను జ్ణానం పొందిన బోది వ్రృక్షం పేరు వచ్చేలా స్థిర పడినాడని తెలిపారు. తనను ధిక్కరించి వెళ్లిన వారినే తన బోధనల ద్వారా శిష్యులుగా చేసుకున్నారని చెప్పారు. ఆనాటి విశ్వ సుందరి, రాజు నర్తకి గణిక వ్రృత్తిలో వున్న“అమ్రపాలి’నిని బౌద్ద బిక్షుణిగా మార్చి నాడని తెలిపారు. త్రిరత్నాలను, పంచశీల ను , అష్టాంగ మార్గంను బోధీంచినాడని , కులాన్ని వర్ణాశ్రమ ధర్మాలను నిరశించటమే కాక84 వేల ప్రవచనాలు చేసిన మహనీయుడు గౌతమ బుద్ధుడు* అని తెలిపారు. ఈ మహానీయుడు దేశానికి ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని ,ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్, శ్రీనివాస్, గుర్రపు రాజమౌళి నాయకులు మైదం మహేశ్, కట్కూరి మొగిలి, గడ్డం సదానందం, కింసారపు సంద్య, ప్రతాప్, చందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!