రైతులను నిరుద్యోగులనుమోసం చేసిన కాంగ్రెస్

# గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బుద్ధి చెప్పాలి
# ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
నర్సంపేట/ఖానాపురం,నేటిధాత్రి :
అనవసరపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులను మోసం చేసిందని ఇప్పుడు జరుగబోయే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకు మద్దతుగా గురువారం ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి డాక్టర్ రవీందర్ రావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మేధావి,ఉన్నత విద్యావంతుడు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ఓటువేసి గెలిపించాలని కోరారు. రైతులను, ఉద్యోగులను గ్రాడ్యుయేట్లను, సమస్త ప్రజానీకాన్ని హామీలతో మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిoదని ఆరోపించారు.పదేళ్ల కాలంలో అధికంగా గవర్నమెంట్ ఉద్యోగులను తీసుకు వచ్చింది దేశంలో కేవలం తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటులో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తుందన్నారు.క్వింటాల్ కు 500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 24 గంటల్లోనే మాట మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రైతు వ్యతిరేకి..పచ్చి మోసగాడు అని ఆరోపించారు.కేవలం సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామనడం, దొడ్డు రకం, ఇతర పంటలకు ఇవ్వను అని మాట మార్చడం సీఎం రైతులను మోసం చేసినట్లే అని రైతులకు కరెంటు, ఎరువులు విత్తనాలను సకాలంలో అందించలేని అసమర్ధులు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు అని చెప్పారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంటర్వ్యూ పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొని తిరుగుతుండడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.శాసనమండలిలో ఉద్యోగుల సమస్యలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే దమ్మున్న రాకేష్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశంలో ఒడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఎంపిపి వేములపల్లి ప్రకాష్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఎంపిటిసి, క్లస్టర్ భాద్యులు, మండల కోఆప్షన్ సభ్యులు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!