బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకోవాలి

జైపూర్, నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తూ అనుచిత వాక్యాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు బిజెపి నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్లకు ఇవే మా సవాళ్లు ఖబడ్దార్ మీరు చేసినటువంటి అనుచిత వాక్యాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు న్యాయం చేసే పార్టీ 75% వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొనడం జరిగినది తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించినది దొడ్డు బియ్యం 90 శాతం ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలు సన్న బియ్యం తినాలని ఆలోచన తోటి రైతులను ఉత్తేజిస్తూ 500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని రైతులు కూడా గమనిస్తూ గత పది ఏళ్ల కెసిఆర్ పాలనలో రైతుకు అన్యాయం తప్ప న్యాయం జరగలేదు. వాళ్లు ప్రభుత్వాన్ని కోల్పోవడం వల్ల మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఈసీ వాళ్లకు సపోర్ట్ చేయకుండా ఇలాంటి ధర్నాలు చేయొద్దని వాళ్లను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల్ నాయకులు మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి డిసిసి మెంబర్ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసంపల్లి శ్రీకాంత్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆసంపల్లి శివకుమార్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!