మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్.
చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ మాట్లాడుతూ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి-తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.అని,
చదువుకున్న యువత,విద్యావేత్తలు అలోచించి ప్రజా సమస్యల పై ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న ని గెలిపించుకుందాం.యువత దేశానికీ వెన్నెముక,యువత రాజకీయల్లోకి రావాలి సరైన నాయకుడు తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాలిఅని.భూపాలపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మరియు భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షులు-అయితే ప్రకాష్ రెడ్డి సూచనలమేరకుక్లస్టర్ పరిధిలోని మరియు చిట్యాల మండలంలోని పట్టభద్రులందరికి ఈ నెల 27 న జరగబోయే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నకు* మీ మొదటిప్రధాన్యత ఓటువేసి అధికమెజారిటీతో గెలిపించేవిధంగా తోడ్పడాలి అని పిలుపునిచ్చారు.