వివాహిత ఆత్మహత్య కేసులో ముగ్గురి రిమాండ్

పరకాల నేటిధాత్రి

హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని పోచారం గ్రామానికి చెందిన జూపాక జ్యోతితో తేదీ 19మే రోజున అదనపు వరకట్నం కోసం జ్యోతి కుటుంబంలో గొడవ పడగా జ్యోతి తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.వెంటనే పరకాల ఏసిపి శ్రీ కిషోర్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తులో చేయడం జరిగింది. మంగళవారం రోజున ఆత్మహత్యకు కారకులైన ఆమె భర్త ప్రశాంత్,అత్త అహల్య,మామ రవి లను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పరకాల కోర్టులో జడ్జి ముందు హాజరు పరచడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *