కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటి ధాత్రి:
భారతదేశంలో సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశాన్ని ఆర్థికపథంలో నడిపారని, సరికొత్త సంస్కరణలతో అభివృద్ధిలో వేగం పెంచారని కొనియాడారు. అతి చిన్న వయసులోనే ప్రధాని పీఠాన్ని అధిరోహించి, త్యాగానికి ప్రతీకగా చరిత్రలో నిలిచి పోయారని అన్నారు. ఆయన చేపట్టిన కార్యచరణలో భాగంగా దేశంలో సాంకేతిక రంగం లో ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చిందం రవి దుబాస్ రఫీ రవిపాల్ ప్రపంచ రెడ్డి ప్రేమ్ సాగర్ రాజేందర్ రాజు పత్తి శీను వల్ప దాసు రాము కోల శీను తదితరులు పాల్గొన్నారు.