రైతు వద్ద రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కమలాపూర్ తహశీల్దార్ మాధవి,ధరణి ఆపరేటర్ రాకేష్….
తహశీల్దార్ మాధవి పై పలు అవినీతి ఆరోపణలు……
నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)తండ్రి ద్వారా సంక్రమించిన వ్యవసాయ భూమిని కుమారుడికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కు చేసేందుకు గాను లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన కమలాపూర్ తహశీల్దార్ మాధవి,ధరణి ఆపరేటర్ రాకేష్.ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామానికి చెందిన కసబోజుల గోపాల్ తన తండ్రి కసబోజుల రాజయ్య పేరిట గల 3 ఎకరాల 2 గుంటల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా తన పేరిట మార్చుకునేందుకు ఈనెల 9న మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. తెల్లవారి పదో తారీకు రిజిస్ట్రేషన్ కోసము స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి బాధితుడు తన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లడం జరిగింది.తాసిల్దార్ మాధవిని సంప్రదించగా పట్టించుకోకపోవడంతో తిరిగి కుటుంబ సభ్యులందరూ ఇంటికి వెళ్లారు. మరోసారి ఈనెల 18న రిజిస్ట్రేషన్ గురించి తహసిల్దారును బాధితులు కలవడం జరిగింది.
6000 రూపాయలు తనకు లంచంగా ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని తాసిల్దార్ మరోసారి తిప్పి పంపడం జరిగింది. తహసిల్దార్ కు లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు హన్మకొండ లో గల ఏసీబీ కార్యాలయంలో అధికారులకు తన గోడు వెళ్ళ బోసుకోవడం జరిగి ది. అవినీతి నిరోధక శాఖ అధికారుల సూచనల మేరకు మరోసారి సోమవారం రిజిస్ట్రేషన్ కోసం బాధితుడు తాసిల్దార్ కార్యాలయానికి రావడం జరిగింది. 6 వేలకు బదులుగా ఐదు వేల రూపాయల లంచంగా తీసుకునేందుకు తాసిల్దార్ ఒప్పుకోవడంతో లంచం రూపాయలు ఐదు వేలు ధరణి ఆపరేటర్ రాకేష్ ఇస్తుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీనిలో రూ.4000 రూపాయలు తాసిల్దార్ మాధవికి కాగా రూ.1000 ఆపరేటర్ కు ఇచ్చే ఒప్పందంగా బాధితుడు తెలిపాడు. డబ్బులు తీసుకుంటూ ఏసీబి అధికారులకు పట్టుబడిన ఆపరేటర్ రాకేష్ ఇచ్చిన వాంగ్మూల మేరకు తాసిల్దార్ మాధవిని,ఆపరేటర్ రాకేష్ ను ఏసీబీఅధికారులు అదుపులోకి తీసుకున్నారు.వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డిఎస్పి తెలిపారు.ఇలా ఉండగా తహసిల్దార్ పై గతంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు వాటి అన్నిటిపై కూడా విచారణ జరిపనున్నట్లు అధికారులు తెలిపారు.