కాంగ్రెస్ పార్టీలో చేరిన బి ఆర్ఎస్ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో పార్లమెంటరీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గారెంటీలో ఐదు పథకాలు అమలు అవుతున్నాయి అభివృద్ధిని చూసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని నాయకులు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని
కాంగ్రెస్ లో గాంధీనగర్ గ్రామాల నుండి పలువురు బిఆర్ఎస్ పార్టీ గణపురం ఎంపిటిసి మోట పోతుల శివశంకర్ గౌడ్ గాంధీనగర్ గ్రామ మాజీ సర్పంచ్ వీరితోపాటు దాదాపు 500 మంది భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు గారి అధ్యక్షతన , వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గార్లఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!