
ఏ.ఐ.ఎస్.బి డిమాండ్
డి .ఐ. ఈ. ఓ కార్యాలయ సూపరిండెంట్ కి వినతి
హన్మకొండ, నేటిధాత్రి:
హన్మకొండ జిల్లా పరిధిలో అనధికారికంగా నడుస్తున్న మేధా (వి) ప్రవేట్ జూనియర్ కళాశాల అదనపు బ్రాంచ్ లను మూసివేయాలని యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హనుమకొండ జిల్లా డిఐఈఓ కార్యాలయ సూపరిండెంట్ చంద్రమౌళి కి ఏ.ఐఎస్.బి జిల్లా నాయకులు ఏం మోహన్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండ జిల్లా పరిధిలో యూనివర్సిటీ క్రాస్ వద్ద ఉన్న కందగట్ల కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మేధావి జూనియర్ కళాశాలకు ఈ బ్రాంచ్ కు మాత్రమే పర్మిషన్ ఉండగా అదనంగా మరో రెండు బ్రాంచ్లను అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తూ ఇటు ప్రభుత్వానికి అటు విద్యార్థులకు మోసం చేస్తూ పరిమితికి మించినా అడ్మిషన్లు చేస్తున్నారు కావున జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు తక్షణమే మేధావి కళాశాలకు సంబంధించిన అనుమతి లేని బ్రాంచ్లను మూసివేయాలని వారు వినతిపత్రంలో కోరారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని వారు హెచ్చరించారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో జిల్లా నాయకులు సురేందర్ ఉదయ్ రాజు తదితరులు ఉన్నారు.