కాంగ్రెస్ పార్టీలో భారీ చేరిక లు

నిజాంపేట ,నేటి ధాత్రి,మే 8

నిజాంపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచులు కొమ్మట సత్యనారాయణ,చిన్న పైడి శ్రీనివాస్ రెడ్డి, తోపాటు సుమారు 40 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి మైనంపల్లి రోహిత్ రావుతో సాధ్యమని కాంగ్రెస్ లో చేరమన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!