మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మండలం, పంబాపూర్, దూదేకులపల్లి గ్రామంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్భంగా పంబాపూర్, దూదేకులపల్లి,గొల్లబుద్ధారం,గొల్లబుద్ధారం తండా గ్రామంలో ముఖ్యకార్యకర్తల తో సమావేశం ఏర్పాటు చేసి డా.సుధీర్ కుమార్ ని గెలిపించాలని కోరారు.
అనంతరం జాతీయ ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్ళి ఉపాధి హామీ కూలీలను పలకరించి, దొంగ హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చి, మాయ మాటలు, ఒట్లు , తిట్లు, అబద్దపు ప్రచారాలు చేస్తూ హామీలు నెరవేర్చకుండా తేదిలు మారుస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కి భయం కలిగించాలంటే మీ అమూల్యమైన ఓటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ ని గెలిపించాలని, లేదంటే తన పరిపాలనకు ప్రజల తీర్పు అంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతాడు తప్ప హామీల అమలు గాలికి తిరుగుతాయి అని అన్నారు.
కావున ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల పక్షాన, తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు.