
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తమిళనాడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నాగ రాజన్ కర్ణాటక బీజేవైఎం స్టేట్ జనరల్ సెక్రెటరీ కె మారుతి గారు మండల పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు దిశ నిరుద్దేశం చేసి పార్టీ బలపరిచిన కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాటికి సంబంధించిన బాధ్యతలు మీపై ఉన్నాయని తెలియజేస్తూ కొన్ని సూచనలు అందించారు తర్వాత గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని పార్టీ సీనియర్ నాయకులు అయినా సంతోష్ ఇంటికి వెళ్లి కలిశారు తర్వాత పార్టీ కార్యకర్త ప్రశాంత్ గారి కోరిక మేరకు వారి ఇంట్లో టిఫిన్ చేసి తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఆసాని రామలింగారెడ్డి పార్టీ మండల అధ్యక్షులు పార్టీ వివిధ మోర్చా అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు బిజెపి పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు