మేడే జెండా ఎగురవేసిన చేసిన చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

ఎర్రజెండా సాక్షిగా కార్మిక హక్కులకై కొట్లాడుదాం
ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ ఈ 138వ మే డే జెండాలను భూపాలపల్లి లోని వివిధ డిపార్ట్మెంట్ లతో పాటు సెంటర్లో జెండాలు ఎగరవేయగా ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యాలయం ముందు చంద్రగిరి శంకర్ జండా ఆవిష్కరణ చేశారు
ఈ సందర్భంగా తెలంగాణ గోదావరి కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదం పెట్టుబడి దారిదేశమైన అమెరికా లోనే ఈ ఎర్రజెండా పుట్టిందని ఆనాడే కార్మికుల హక్కుల కోసం పని దినాల కోసం హీరోచితమైన పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కులను సాధించిందని వారన్నారు. నాడు అమరవీరుల సాక్షిగా సాధించుకున్న కార్మిక హక్కులను నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందూ పాసింజం పేరుతో నాలుగు లేబరు చట్టాలను తీసుకువచ్చి కార్మిక హక్కులని కాలరాస్తూ బానిస సమాజంలోకి నెట్టి వేస్తుందని కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు జేబు సంస్థలు గా మారాయని వారన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే మళ్ళీ అధికారంలోకొస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని కార్మిక హక్కులు ఉండవని నూతన చట్టాలు అమలులోకి వస్తాయని బహిరంగంగా ప్రకటిస్తూ ఎన్నికలు అంటే ఇక ఒకే ఎలక్షన్స్ ఉంటాయని ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ పాలన కొనసాగిస్తున్నారని వారు అన్నారు కాపాడుకునే విధంగా ఉండాలని ఆస్ఫూర్తితో మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉందని వారి సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!