అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :

గీసుకొండ మండలకేంద్రానికి చెందిన చినగారి రాజు అనే వ్యక్తి తీవ్ర కిడ్నీవ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో మృతుని అంత్యక్రియల నిర్వహణకు సహాయార్థం గీసుకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి రూ.5 వేల నగదు సహాయాన్ని పంపగా ఆ నగదును మాజీసర్పంచ్ దౌడు బాబు, గీసుకొండ సోషల్ సర్వీస్ టీమ్ సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ కలిసి మృతుని కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు పోలీసు కానిస్టేబుల్ చినగారి రాజు, మేకల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!