వేసవిలో మంచినీటి సమస్య రాకుండా చూసుకోవాలి
ప్రత్యేక అధికారి బద్రు నాయక్
శాయంపేట నేటి ధాత్రి:
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు చేపట్టుటకు, పురోగతి చేయవలసిన కార్యాచరణ ప్రణాళికను మండల ప్రజా పరిషత్ శాయంపేట కార్యాలయo నందు సమావేశం ప్రత్యేకాధికారి బి.భద్రు నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో అమ్మ ఆదర్శ పాఠశాలల పురోగతి సాధించి పనులు మే 20 లోపు పూర్తి చేయాలని కోరారు.పూర్వము జరిగిన సమీక్ష సమావేశములో పంచాయతీ కార్యదర్శులతో జరిగిన చర్చలో భాగంగా మండలములోని అన్ని గ్రామాలలో తాగునీటి సమస్యలు ఉండకుండా ఉండుటకు చేపట్టవలసిన పనులను మండల ఫ్రత్యేక అధికారి ఏర్పాటు చేయడ మైనది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణి చంద్ర,ఎంఈఓ రమాదేవి, ఐకెపి శ్రీధర్ రెడ్డి,అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, వివో ఎస్, సంబంధిత గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.