జైపూర్, నేటి ధాత్రి:
చెన్నూర్ నియోజకవర్గానికి జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన జలంపెల్లి సృజన్ ని ఐవైసి పెద్దపల్లి పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జి అరుణ్ వాల్మీకి మరియు మంచిర్యాల జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ శశి వదన్ సమక్షంలో నియమించడం జరిగింది. ఆ నియమిక పత్రాన్ని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన గడ్డం వంశీ కృష్ణ చెన్నూర్ శాసనసభ సభ్యుడు వివేక్ వెంకటస్వామి చేతుల ద్వారా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సృజన్ మాట్లాడుతూ రాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా గడ్డం వంశీ కృష్ణ ని భారీ మెజారిటీతో గెలిపించడాని కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీని బలపేతం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాడు.