6 గ్యారెంటీ ల అమలుతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై రెట్టింపైన నమ్మకం

పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్న నియోజకవర్గ ప్రజలు

భద్రాచలం నేటి ధాత్రి

మాజీ గ్రంథాల చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మాజీ గ్రంథాల చైర్మన్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భద్రాచలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం వల్ల,తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై ఉంచిన నమ్మకం ఆదరణ ఇప్పుడు మరింతగా పెరిగిందని

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో తెలంగాణ ప్రజల ఆదరణతో విజయం సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనం చేస్తుందని, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు,పోరిక బలరాం నాయక్ ని భద్రాచలం నియోజకవర్గం ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాసమల్ల రాము,అన్నెం రామిరెడ్డి, షాబీర్ భాష, మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *