ఎంపీగా సుధీర్ కుమార్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే

పరకాల నేటిధాత్రి
వరంగల్ పార్లమెంటు నుంచి బి.ఆర్.ఎస్.అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారపెల్లి సుధీర్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మంగళవారం హనుమకొండ లోని వారి నివాసంలో పరకాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంటు బి.ఆర్.ఎస్.అభ్యర్థి మారపెల్లి సుధీర్ కుమార్ గారు హాజరుకావడం జరిగింది.సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని కేసీఆర్‌ పాలనలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని నాలుగు నెలల రేవంత్‌ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు, రైతులు సాగునీరందక, కరెంట్‌ రాక చుక్కలు చూస్తున్నారు.బి.ఆర్.ఎస్.పార్టీ శ్రేణులు సమన్వయంతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.బి.ఆర్.ఎస్.ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ధర్మారెడ్డి అన్నారు.అనంతరం ఎంపి అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఒక్కసారి దీవించండి మీకు అండగా ఉంటామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు,మహిళలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియచేయాలని కాంగ్రెస్,బిజెపి రెండు పార్టీలు ఒకటే బి.ఆర్.ఎస్.పార్టీ కుటుంబసభ్యులు కలిసికట్టుగా పనిచేయాలి అని కన్నతల్లి లాంటి పార్టీని మోసంచేసినవాళ్ళకు ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ పాలనలో నాలుగు నెలలు తిరగకుండానే ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయామని ప్రజల్లో మార్పు మొదలైందని కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇలాంటి పరిస్థితుల్లో ఏనాడు లేవన్నారు.పరకాల నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ వస్తున్న నమ్మకం ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *