భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిస్థాయిలో అందించాలి
శాయంపేట నేటి ధాత్రి:
ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మండల జర్నలిస్టు అధ్యక్షుడు కూడలివద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆయన 133 వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తించబడటం గొప్ప విషయం అన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మ కమైనద న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆలోచనతో పాలను అందించాలని కోరారు. విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే బుడ్డి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగము వల్లనే నేడు దేశంలో చట్టాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.