గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళను శనివారం జర్మన్ దేశస్థుడు తుబి యాస్ సందర్శించారు. కొచ్చి నుండి ద్విచక్ర వాహనంపై వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ కోటగుళ్ళకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగుళ్ల శిల్ప సంపద అద్భుతంగా ఉందని ఫోటోలు వీడియోలను చిత్రీకరించుకున్నారు. మరోసారి తమ బృందంతో కోటగుళ్ళు కు వస్తామని తుబి యాస్ తెలిపారు.