
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం అధ్వర్యంలో శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా గత నాలుగు రోజులుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌడ సంఘం నూతన కమిటీ సభ్యులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.లక్నేపల్లి సంఘం అధ్యక్షుడు మర్ధ సురేష్ గౌడ్
అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిదులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్ హాజరైయ్యారు.ఈ కార్యక్రమంలో సంఘంఉపాధ్యక్షులు మర్ధ సదయ్య గౌడ్,కార్యదర్శి గోడిశాల సురేష్ గౌడ్,
మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు మచ్చిక రాజు గౌడ్,మద్దెల సాంబయ్య గౌడ్,జిల్లా ఉపా జూలూరి హరిప్రసాద్ గౌడ్,డివిజన్ ఆధ్యక్షుడుకందుల శ్రీనివాస్ గౌడ్,లక్నేపల్లి సంఘం సహ కార్యదర్శి గోడిశాల క్రాంతి గౌడ్,కమిటీ సభ్యులు మడ్డి రమేష్ గౌడ్,కక్కేర్ల సమ్మయ్య గౌడ్,కత్తి విక్రమ్ గౌడ్,కత్తి వేణు గౌడ్,మర్ధ లక్ష్మినర్సు గౌడ్,మునిగల రాజేందర్ గౌడ్,మర్ధ సంతోష్ గౌడ్,గోడిశాల కృష్ణ గౌడ్,కోల రవీందర్ గౌడ్,గొట్టేపర్తి రమేష్ గౌడ్,మాజీ సర్పంచ్ గోడిశాల రాంబాబు గౌడ్,మచ్చిక రాజ్ కుమార్ గౌడ్,గుండెబోయిన సాగర్ గౌడ్ పలువురు గౌడ కులస్తులు పాల్గొన్నారు.