ఘనంగా రంజాన్ ఈద్ వేడుకలు!!!

శాఖపూర్ ఈద్గాలో శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొప్పుల!!!
ఎండపల్లి నేటి ధాత్రి *
మండలంలో ఘనంగా రంజాన్ ఈద్ వేడుకలు జరిగాయి,, ఈ సందర్భంగా శాఖపూర్ ఈద్గాలో మాజీ మంత్రి పెద్దపల్లి బారాస ఎంపి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు!వెల్గటూర్,ఎండపెల్లి మండలాల్లోని గుల్లకోట, జగదేవ్ పేట, శాఖపూర్, అంబారిపేట, పాతగుడూర్ గ్రామాలలోని ఈద్గాల వద్ద అత్యంత పవిత్రమైన రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని పెద్దఎత్తున ముస్లిం,మైనార్టీ సోదరులు నమాజ్ నిర్వహించడం జరిగింది.ఈ మాసంలో పవిత్ర దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భావం జరిగినందున ముస్లిం,మైనార్టీ ప్రజలు అత్యంత పవిత్రమైనదిగా భావించి నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి నెలవంక దర్శనమియ్యడంతో ఈద్ ను జరుపుకోవడం ప్రత్యేకత, శాఖపూర్ గ్రామంలో నిర్వహించిన ఈద్ వేడుకల్లో మాజీ మంత్రివర్యులు,పెద్దపల్లి పార్లమెంటు భారాస పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హజరై ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్, ఇమామ్, మౌజాన్, సదర్, ముస్లీం మతపెద్దలు మహ్మద్ సలీం, రఫీ, ఫకీరోద్దిన్, అనీఫ్, అల్లీ, రహీం, అబ్దుల్లా, అలీం, అబ్బాస్, దస్తగిరి, అంకూస్, హఫీజ్, తాజ్, ప్యార్ మియా, నజీర్, బాబర్, సాదిక్ మరియు ఉమ్మడి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *