చెంచు కాలనీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్లతిరుపతి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లిని లక్ష్మీపురం తండా గ్రామ శివారులోని చెంచు కాలనీలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పర్యటించిన మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, అనంతరం
కాలనీ పర్యటించి కాలనీ వాసులు తో మాట్లాడి వారి స్థితి గతులను తెలుసుకొని వారి దినపరిస్తితిని చూసి ఈ సమాచారాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కి వారి పరిస్థితిని వివరించి పురిగుడిసెలో నివస్తున్నారు అన్నా సమాచారం అందించిన వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అక్కడ నివసిస్తున్నా 14 కుటుంబాలకు మొదటి విడతలోనే వారికి 14 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది.
రెండు లేదా మూడు రోజులలో కాలనికి వచ్చి సందర్శించి ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు,ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య, మండల పార్టీ ఉపాధ్యక్షులు బండి భగవాన్, మాజీ సర్పంచ్ లు ఎర్రబెల్లి భద్రయ్య పట్టేం శంకర్, జవహర్ లాల్, నాయకలక్ష్మీపురం తండా యూత్ నాయకుడు ప్రకాష్ నాయకులు గట్టు రాజు, లావుడ్య రవీందర్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *