
నేటిధాత్రి హసన్ పర్తి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ని పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాల వంగపహాడ్ పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాడూరి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. మహిళలు అన్ని రంగాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధికారత సాధించారని తెలిపారు. ఒక మహిళా చదువుకోవడం వల్ల వారి కుటుంబం అన్ని రంగాల్లో ముందుంటుందని తెలిపారు. మహిళలు నేడు అన్ని రంగాలలో ఉద్యోగాలు చేస్తూ గృహిణిగానే కాకుండా అన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పక్షాన పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల కృషిని కొనియాడుతు వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీమతి అరుణకుమారి ,రాణి, మాలతి దేవి, పుష్ప, మహమూదాబాను మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఉదయ్ కుమార్, శ్రీ వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు