కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తుంది

కళ్యాణలక్ష్మీ, చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలోని (ఎమ్మార్సీ) భవనంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 30 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువ కలిగిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. గత పాలకుల కంటే భిన్నంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పులి తిరపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *