పట్టించుకోని జిల్లా అధికారులు
మండలానికి తక్షణమే ఎంఈఓ నియమించాలి
మధ్యాహ్నం మూడు గంటలకే బంద్ అవుతున్న స్కూల్ లపై అధికారులు తీసుకున్న చర్యలేవి
మూడు గంటలకు బంధువుతున్న స్కూల్ లను తగిన ఆధారాలతో నిరూపిస్తాం
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
మండలంలో విద్యావ్యవస్థ గాడి తప్పుతుందని విద్యావ్యవస్థను పట్టించుకోవడంలో జిల్లా అధికారులు వైఫల్యం చెందుతున్నారని తక్షణమే మండలానికి ఎంఈఓ ను నియమించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు డిమాండ్ చేశారు మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ మండలంలో చాలా స్కూళ్లు మధ్యాహ్నం రెండు మూడు గంటలకే బంద్ అవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని వారిపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారని ఉపాధ్యాయులను కట్టడి చేయటంలో తీవ్రంగా వైఫల్యం చెందుతున్నారని ఇలా కొనసాగితే ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వ్యవస్థ ఎలా బాగుపడుతుందని విద్యార్థులకు చదువు ఎలా వస్తుందని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే చదువు రాదు అనే అపోహ మరింత బలపడుతుందని వారన్నారు ఇప్పటికే అధికారులు పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉంచేలా మండలానికి తక్షణమే నూతన ఎంఈఓ ని యమించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు మండలంలో ఏజెన్సీ ప్రాంతంలోని విద్యా వ్యవస్థ పై అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తే పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు